బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ లేటెస్ట్ మూవీ "ఎమర్జెన్సీ". పీరియడ్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు కథ - డైరెక్షన్ కంగనానే చేస్తుంది. భూమిక చావ్లా కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి రితేష్ షా డైలాగ్స్-స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. మణికర్ణికా ఫిలిమ్స్ బ్యానర్ పై కంగనా రనౌత్, రేణు పిట్టి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం 2023లో విడుదలవుతుంది.
ఇటీవలే ఈ మూవీ నుండి కంగనా, అనుపమ్ ఖేర్ ల ఫస్ట్ లుక్స్ విడుదలవ్వగా, ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. ఇందిరాగాంధీ రోల్ లో కంగనా, జయప్రకాశ్ నారాయణ్ పాత్రలో అనుపమ్ ఖేర్ స్టన్నింగ్ పెర్ఫార్మన్స్ కనపరిచారు.
లేటెస్ట్ గా ఈ మూవీ నుండి మరొక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఫస్ట్ లుక్ విడుదలైంది. అదే అటల్ బిహారి వాజ్పేయ్ ఫస్ట్ లుక్. శ్రేయాస్ తాల్పడే ఈ సినిమాలో అటల్ బిహారి గా నటిస్తున్నారు. ఈ మేరకు విడుదల చేసిన పోస్టర్లో శ్రేయాస్ అచ్చు వాజ్పేయ్ లానే కనిపిస్తున్నారు.