మెగా మేనల్లుడు వైష్ణవ తేజ్ నటించిన కొత్త చిత్రం "రంగరంగ వైభవంగా". తమిళ అర్జున్ రెడ్డి ని తెరకెక్కించిన గిరిశాయ ఈ చిత్రానికి దర్శకత్వం చేస్తున్నాడు. 'రొమాంటిక్' ఫేమ్ కేతికా శర్మ హీరోయిన్గా నటిస్తుంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బాపినీడు సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని BVSN ప్రసాద్ నిర్మిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
లేటెస్ట్ గా ఈ మూవీ నుండి థర్డ్ లిరికల్ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేసారు. సిరిసిరి మువ్వల్లోన అని సాగే ఈ పాటను జావేద్ అలీ, శ్రేయా ఘోషల్ ఆలపించారు. హీరో హీరోయిన్ల మధ్య సాగే లవ్ సాంగ్ గా చిత్రీకరించబడిన ఈ పాటను ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు విడుదల చేయనున్నారు సెప్టెంబర్ 2వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది.