బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ను నిందితురాలిగా పేర్కొంటూ 200 కోట్ల రూపాయల మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బుధవారం దాఖలు చేసిన సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ను ఢిల్లీ కోర్టు ఆగస్టు 31న పరిశీలించనుంది.ఈ కేసులో ఈడీ పలుమార్లు విచారణకు సమన్లు జారీ చేసిన ఫెర్నాండెజ్ను తొలిసారిగా చార్జ్షీట్లో నిందితురాలిగా చేర్చారు.అయితే ఈ విషయంలో ఫెర్నాండెజ్, నోరా ఫతేహీలు నమోదు చేసిన వాంగ్మూలం వివరాలను పత్రాల్లో పేర్కొన్నారు.అదనపు సెషన్స్ జడ్జి ప్రవీణ్ సింగ్ ఈ కేసులో అనుబంధ ఛార్జిషీట్ను పరిగణనలోకి తీసుకునే అంశంపై ఆగస్టు 31కి వాయిదా వేశారు.