మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి నటించిన 'గాడ్ ఫాదర్' సినిమా టీజర్ ను ఈ నెల 21న విడుదల చేయనున్నట్లు మూవీ టీం ప్రకటించింది. మలయాళ సినిమా లూసిఫర్ కి రీమేక్ గా ఈ సినిమాను తీస్తున్నారు. ఈ సినిమాలో నయనతార, సత్య దేవ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సల్మాన్ ఖాన్, పూరి జగన్నాధ్ అతిధి పాత్రల్లో కనిపించనున్నారు. థమన్ సంగీతం అందించిన ఈ సినిమాను అక్టోబర్ లో థియేటర్లలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.