కోలీవుడ్ సినిమాలలో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలలో మణిరత్నం 'పొన్నియిన్ సెల్వన్' ప్రాజెక్ట్ ఒకటి. పొన్నియిన్ సెల్వన్: పార్ట్ 1 సెప్టెంబర్ 30, 2022న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమాలోని చోళ చోళ అనే టైటిల్ తో సెకండ్ సింగిల్ని విడుదల చేసారు. ప్రముఖ దర్శకుడు మణిరత్నం ఈ ఈవెంట్ లో కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ స్టార్ డైరెక్టర్ మెగాస్టార్ చిరంజీవికి కృతజ్ఞతలు తెలిపాడు. దీనికి ఖచ్చితమైన కారణాన్ని త్వరలో తెలుసుకుంటురు అని చెప్పారు. ఇప్పుడు ఈ సినిమా తెలుగు వెర్షన్కు మెగా స్టార్ చిరు వాయిస్ ఓవర్ ఇస్తున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై క్లారిటీ రావాలంటే మూవీ మేకర్స్ నుండి అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది.
ఈ భారీ బడ్జెట్ పీరియడ్ మూవీలో కార్తీ, విక్రమ్, జయం రవి, శోభిత దూళిపాళ, ఐశ్వర్యరాయ్ బచ్చన్, త్రిష తదితరులు ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ని అందిస్తున్నారు. 250 కోట్ల భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ సినిమాని మద్రాస్ టాకీస్తో కలిసి లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది. ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa