టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా వస్తుంది అని అందరికి తెలిసిన విషయమే. ఈ మూవీకి టెంపరరీగా 'SSMB28' అని టైటిల్ మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన సిజ్లింగ్ బ్యూటీ పూజా హెగ్డే రొమాన్స్ చేయనుంది. ఈ సినిమాలో మహేష్ ఒక స్పెషల్ ఏజెంట్గా నటిస్తున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. కొన్ని నెలల క్రితమే ఈ సినిమా ప్రారంభమైనప్పటికీ ఇంకా షూటింగ్ ప్రారంభం కాలేదు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో మూవీ మేకర్స్ ఒక భారీ సెట్ను నిర్మిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాకి సంభందించిన ఎక్కువ భాగం షూటింగ్ ఈ సెట్ లోనే జరుగనుంది అని లేటెస్ట్ టాక్. ఫ్యామిలీ ఎంటర్టైనర్ ట్రాక్ లో రానున్న ఈ సినిమాని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మిస్తుంది. ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నారు.