నటకిరీటి రాజేంద్రప్రసాద్, నరసింహ రాజు ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రం "అనుకోని ప్రయాణం". యాపిల్ క్రియేషన్స్ బ్యానర్ పై డీవై జగన్ మోహన్ ఈ సినిమాను నిర్మిస్తుండగా, వెంకటేష్ డైరెక్ట్ చేస్తున్నారు.
తాజాగా మేకర్స్ ఈ మూవీ ట్రైలర్ విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసారు. రేపు సాయంత్రం ఆరు గంటలకు ప్రసాద్ ల్యాబ్స్ లో అనుకోని ప్రయాణం థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగనుంది.
ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ ప్రేమ, తులసి, రవిబాబు, శుభలేఖ సుధాకర్, నారాయణరావు, అనంత్, ప్రభాస్ శ్రీను, తాగుబోతు రమేష్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. అక్టోబర్ 28వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa