టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు బాబీతో ఒక సినిమా చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఈ మూవీకి 'వాల్తేరు వీరయ్య' అనే టైటిల్ ని మేకర్స్ ఖరారు చేసారు. ఈ ప్రాజెక్ట్ లో చిరు సరసన టాలెంటెడ్ అండ్ గార్జియస్ యాక్ట్రెస్ శృతి హాసన్ కథానాయికగా నటిస్తుంది. ఇటీవలే మూవీ మేకర్స్ ఈ సినిమా టీజర్ను విడుదల చేశారు. టీజర్ కి సినీప్రేమికుల నుండి భారీ స్పందన లభించింది.
కొద్ది రోజుల క్రితం, సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రం నుండి బాస్ పార్టీ అనే మొదటి సింగిల్ త్వరలో విడుదల కానుందని ఒక ఆసక్తికరమైన అప్డేట్ను వెల్లడించారు. తాజాగా ఇప్పుడు, మూవీ మేకర్స్ ఈ పాట విడుదల తేదీకి సంబంధించిన అప్డేట్ ని త్వరలో రివీల్ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ట్రాక్ లో రానున్న ఈ చిత్రానికి రాక్స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో బాబీ సింహా పవర్ఫుల్ విలన్గా నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ భారీ స్థాయిలో నిర్మిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa