రాకేశ్ శశి దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో అల్లు శిరీష్ నటించిన 'ఊర్వశివో రాక్షశివో' చిత్రం గ్రాండ్ గా థియేటర్లలో విడుదలైంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ డిసెంబర్ 9, 2022న ఆహాలో ప్రసారానికి అందుబాటులోకి రానుంది అని తెలుగు OTT ప్లాట్ఫారమ్ ఆహా ప్రకటించింది.
ఈ చిత్రంలో అల్లు శిరీష్ కి జోడిగా అను ఇమ్మాన్యుయేల్ నటించింది. వెన్నెల కిషోర్, సునీల్, ఆమని, కేదార్ శంకర్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని ధీరజ్ మొగిలినేని మరియు విజయ్ ఎం. అచ్చు రాజమణి నిర్మించారు. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకి సంగీతం అందించారు.