ట్రెండింగ్
Epaper    English    தமிழ்

SSMB 28 కోసం రంగంలోకి.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ..!!

cinema |  Suryaa Desk  | Published : Mon, Dec 19, 2022, 09:43 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ త్రివిక్రంల కలయికలో దాదాపు పుష్కరకాలం తదుపరి సినిమా రాబోతుండడంతో ఆడియన్స్ లో అంచనాలు పీక్ స్టేజ్ లో ఉన్నాయి. దీంతో ఈ మూవీ అప్డేట్స్ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. హీరోయిన్ గా పూజా హెగ్డే, మ్యూజిక్ డైరెక్టర్ గా థమన్ లు.. ఈ సినిమాకోసం పని చేస్తున్నారని అఫీషియల్ గా తెలుస్తుంది.


తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాలో ఉండబోయే ఒక కీలకపాత్ర కోసం బాలీవుడ్ నుండి ఒక సీనియర్ హీరోయిన్ ని రంగంలోకి దింపుతున్నారట డైరెక్టర్ త్రివిక్రమ్. సీనియర్ నటీమణులకు తన సినిమాలలో ప్రత్యేక పాత్రలను కేటాయిస్తుంటారు త్రివిక్రమ్. సితార, టబు, దేవయాని, నదియా, సుకన్య .. వీళ్ళందరూ త్రివిక్రమ్ సినిమాలలో కీరోల్స్ లో నటించినవారే.


ఐతే, ఈ సినిమా కోసం బాలీవుడ్ నుండి రాణీముఖర్జీని రప్పిస్తున్నట్టు టాక్ వినిపిస్తుంది. గతంలో ఈ పాత్రలో నటి శోభన పేరు వినిపించింది కానీ, ఇప్పుడు రాణీముఖర్జి పేరు వినిపిస్తుంది. ఒకవేళ ఈ టాక్ నిజమైతే, ఉత్తరాదిన ఈ సినిమాపై చాలా మంచి అంచనాలు ఏర్పడతాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa