లవర్ బాయ్ హీరో సిద్ధార్థ్కు మంగళవారం మధ్యాహ్నం మధురై విమానాశ్రయంలో అవమానం జరిగింది. అతను తన తల్లిదండ్రులతో కలిసి విమానం దిగుతుండగా, సీఆర్పీఎఫ్ సిబ్బంది అతన్ని అడ్డుకుని హిందీలో దుర్భాషలాడారు. ఇంగ్లీషులో మాట్లాడమని ఎంత వేడుకున్నా కనికరించలేదు. ఈ ఘటనపై సిద్ధార్థ్ విమానాశ్రయంలోని అధికారులకు ఫిర్యాదు చేశాడు. తనకు జరిగిన అవమానాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. సిఆర్పిఎఫ్ సిబ్బంది తనను, తన తల్లిదండ్రులను 20 నిమిషాల పాటు వేధించారని సిద్ధార్థ్ ఆరోపించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa