బుల్లితెర నటుడు ఆదర్శ్, చిత్ర శుక్ల జంటగా నటిస్తున్న చిత్రం "గీతసాక్షిగా". డైరెక్టర్ ఆంథోనీ మట్టిపల్లి డైరెక్షన్లో వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో శ్రీకాంత్ అయ్యంగార్, అనితా చౌదరి, రాజా రవీంద్ర, రూపేష్ శెట్టి, భరణి శంకర్ కీలకపాత్రల్లో నటించారు.
తాజాగా ఈ సినిమా నుండి 'అడుగులో అడుగునై' అనే డ్యూయెట్ సాంగ్ ప్రోమో విడుదలైంది. పూర్తి సాంగ్ ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకు విడుదల కానుంది
చేతన్ రాజ్ ఫిలిమ్స్ పతాకంపై చేతన్ రాజ్ నిర్మిస్తున్న ఈ సినిమా ఈనెల 26న థియేటర్లలో విడుదల కాబోతుంది.