నటసింహం నందమూరి బాలకృష్ణ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కలయికలో రూపొందిన చిత్రం "వీరసింహారెడ్డి". సంక్రాంతి కానుకగా ఈనెల 12న థియేటర్లకు రాబోతున్న వీరసింహారెడ్డి తన ఉగ్రరూపాన్ని చిన్న శాంపిల్ గా ట్రైలర్ రూపంలో ప్రేక్షకులకు చూపించారు. ఇంకేముంది, వీరసింహుడి పవర్ఫుల్ డైలాగులు, మాస్ స్వాగ్ డాన్సుల్లో ఈజ్, డైరెక్టర్ టేకింగ్ ... లతో ఈ ట్రైలర్ ప్రేక్షకాభిమానుల నుండి సూపర్బ్ రెస్పాన్స్ అందుకుంటుంది. దీంతో కొన్నిగంటల్లో ఈ ట్రైలర్ #1 పొజిషన్ కైవసం చేసి, యూట్యూబ్ ని రూల్ చేస్తుంది. ఇప్పటివరకు ఈ ట్రైలర్ కు 5 మిలియన్ వ్యూస్, 300కు పైగా లైక్స్ వచ్చాయి.
శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్, హనీ రోజ్ కీరోల్స్ ప్లే చేసారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందించారు.