సినీ నటుడు జూ.ఎన్టీఆర్ తో కలిసి టీమిండియా క్రికెటర్లు దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నెల 18న భారత్, న్యూజిలాండ్ మధ్య ఉప్పల్ స్టేడియంలో వన్డే మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా హైదరాబాద్ కు చేరుకుంది. సోమవారం రాత్రి పార్టీ సందర్భంగా ఎన్టీఆర్, టీమిండియా ప్లేయర్స్ కలిసినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ తో దిగిన ఫొటోలో సూర్యకుమార్, ఇషాన్, గిల్, శార్దూల్ ఠాకూర్, చాహల్ ఉన్నారు.