నైట్రో స్టార్ సుధీర్ బాబు హీరోగా నటించిన రీసెంట్ మూవీ "ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి". 'అష్టాచెమ్మా' ఫేమ్ ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రంలో కృతిశెట్టి హీరోయిన్ గా నటించింది. గతేడాది సెప్టెంబర్ 16వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకులు అంతగా ఇంప్రెస్ కాలేదు.
తాజాగా, జనవరి 29వ తేదీన జెమిని ఛానెల్ లో మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి వరల్డ్ డిజిటల్ ప్రీమియర్ కి రాబోతుంది.
మైత్రి మూవీ మేకర్స్, బెంచ్ మార్క్ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహేంద్ర బాబు, కిరణ్ బళ్ళపల్లి నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ చిత్రంలో శ్రీనివాస్ అవసరాల, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలకపాత్రలు పోషించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa