నటసింహం నందమూరి బాలకృష్ణ గారు ఇటీవల హైదరాబాద్ లో జరిగిన "వీరసింహారెడ్డి" విజయోత్సవ వేడుకలలో చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో అగ్గిని రాజేస్తున్నాయి. లెజెండరీ నటులు SV రంగారావు, అక్కినేని నాగేశ్వరరావు గార్ల మీద బాలయ్య కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేసారు. కొంతమంది ప్రేక్షకాభిమానులు తమ అభిమాన నటులను బాలయ్య తన వ్యాఖ్యలతో అవమానించారని, సోషల్ మీడియాలో ఘాటుగా విమర్శిస్తున్నారు. ఆల్రెడీ ఈ కాంట్రవర్సీపై అక్కినేని కుటుంబం తరఫు నుండి నాగచైతన్య, అఖిల్ ట్విట్టర్ వేదికగా స్పందించిన విషయం తెలిసిందే. నందమూరి తారక రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, SV రంగారావు గారు తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డలు. వారిని అగౌరవపరచటం ...మనల్ని మనమే కించపరుచుకోవడం.. అని పేర్కొంటూ చైతూ, అఖిల్ జాయింట్ స్టేట్మెంట్ విడుదల చేసారు.
తాజాగా ఈ కాంట్రవర్సీపై SV రంగారావు గారి మనవళ్లు ఒక వీడియో రూపంలో తమ స్పందనను తెలియచేసారు. బాలయ్య వ్యాఖ్యలలో తమకు కానీ, తమ కుటుంబ సభ్యులకు కానీ ఎలాంటి కాంట్రవర్సీ కనిపించడం లేదని, తోటి నటుడితో జరిగిన సంభాషణ గురించి జనరల్ పోకడలో చెప్పారని తెలిపారు. తమ కుటుంబానికి, నందమూరి వంశానికి చాలా స్నేహపూర్వక సంబంధం ఉందని, ఈ విషయాన్ని ఇంకా సాగదీయొద్దని, తమ ఇరువురి కుటుంబాల మధ్య ఎలాంటి మనస్పర్థలు కలిగించవద్దని వారు కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa