సుహాస్, టీనా శిల్పారాజ్ జంటగా నటిస్తున్న చిత్రం "రైటర్ పద్మభూషణ్". కొత్త దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్ డైరెక్షన్లో ఫీల్ గుడ్ మూవీగా రూపొందుతున్న ఈ సినిమాకు శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నారు. ఆశిష్ విద్యార్ధి, రోహిణి మొల్లేటి కీలకపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా వచ్చే నెల 3వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతుంది. రీసెంట్గా విడుదలైన ట్రైలర్ ఆడియన్స్ నుండి అమేజింగ్ రెస్పాన్స్ అందుకుంటుంది.
లేటెస్ట్ గా ఈ సినిమా నుండి "అయ్యబాబోయ్ గందరగోళం" లిరికల్ వీడియోను రేపు సాయంత్రం 04:05 నిమిషాలకు విడుదల చెయ్యబోతున్నట్టు మేకర్స్ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసారు.