ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహేష్ బాబు-సుకుమార్ సినిమా గురుంచి ఆసక్తికరమైన విషయం

cinema |  Suryaa Desk  | Published : Wed, Jan 23, 2019, 06:30 PM

ప్రస్తుతం మహేశ్ బాబు 'మహర్షి' సినిమా షూటింగుతో బిజీగా వున్నాడు. ఇప్పటికే ఈ సినిమా చాలా వరకూ చిత్రీకరణను పూర్తిచేసుకుంది. ఏప్రిల్ 25వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తరువాత మహేశ్ బాబు .. సుకుమార్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్న సంగతి తెలిసిందే. దాంతో కథా నేపథ్యం ఏమై ఉంటుందా అనే ఆసక్తి అందరిలోనూ పెరిగిపోతోంది.

ఈ సినిమా అడవి నేపథ్యంలో కొనసాగుతుందనేది తాజా సమాచారం. 'రంగస్థలం' కథ గోదావరి నేపథ్యంలో ఎలా సాగుతుందో, ఈ కథ అలా అడవి నేపథ్యంలో నడుస్తుందని అంటున్నారు. కథ మహేశ్ బాబుకి బాగా నచ్చేసిందట. ఎప్పుడెప్పుడు ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందా అని ఆయన కూడా ఆసక్తిని చూపుతున్నట్టుగా చెప్పుకుంటున్నారు. మే నెలలో గానీ .. జూన్ లో గాని ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకావొచ్చని అంటున్నారు. మిగతా వివరాలు త్వరలోనే తెలియనున్నాయి






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa