బాబీ దర్శకత్వంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన 'వాల్తేరు వీరయ్య' సినిమా జనవరి 13, 2023న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని అందుకొని సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. తాజాగా ఇప్పుడు, తెలుగు రాష్ట్రాల్లో ఐకానిక్ థియేటర్స్ లో ఒకటైన వైజాగ్ లోని జగదాంబ థియేటర్ లో ఈ సినిమా సెన్సషనల్ రికార్డుని నెలకొల్పింది.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా SS రాజమౌళి యొక్క మాగ్నమ్ ఓపస్ 'RRR' యొక్క ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ గ్రాస్ ను క్రాస్ చేసి సెన్సేషన్ ని సృష్టించింది. ఈ ప్రాజెక్ట్ లో చిరు సరసన టాలెంటెడ్ అండ్ గార్జియస్ యాక్ట్రెస్ శృతి హాసన్ కథానాయికగా నటిస్తుంది.
ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ కూడా ఒక కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రానికి రాక్స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ భారీ స్థాయిలో నిర్మిస్తుంది.