నంద కిషోర్ అబ్బురు దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన 'వినరో భాగ్యము విష్ణు కథ' సినిమా ఫిబ్రవరి 18, 2023న మహా శివరాత్రి స్పెషల్గా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ విడుదలైన అన్ని చోట్ల మిక్స్ రివ్యూస్ ని అందుకుంటుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా ఆదివారం వరకు ఆస్ట్రేలియా బాక్సాఫీస్ వద్ద A$1,593 వసూలు చేసినట్లు సమాచారం.
ఈ సినిమాలో కిరణ్ సరసన కాశ్మీరా పరదేశి జంటగా నటించింది. మురళీ శర్మ, ప్రవీణ్, శుభలేఖ సుధాకర్ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ విలేజ్ డ్రామాని అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి చేతన్ భరద్వాజ్ సంగీతం అందించారు.