పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ కలిసి ఒక మల్టీ స్టారర్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన ఈ వారంలోనే జరిగింది. దర్శకుడు, నటుడు సముద్రఖని దర్శకత్వంలో ఫాంటసీ కామెడీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది.
తాజా సమాచారం ప్రకారం, ఫస్ట్ షెడ్యూల్ లో ఇద్దరు మెగా హీరోలపై ఒక ప్రత్యేకమైన పాటను మేకర్స్ చిత్రీకరించనున్నారట. మరి, ఈ వార్తపై ఇంకా వివరాలు అందాల్సి ఉంది.
థమన్ స్వరాలు సమకూరుస్తున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తుంది.