గతేడాది టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్స్ గా నిలిచిన చిత్రాలలో 'మసూద' ఒకటి. సక్సెస్ఫుల్ థియేట్రికల్ రన్ తో, బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ కలెక్షన్లను వసూలు చేసిన ఈ సినిమా తదుపరి ఆహాలో డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చి అక్కడ కూడా సెన్సేషనల్ రెస్పాన్స్ అందుకుంది.
ఇప్పుడు ఈ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ అయ్యేందుకు సమయం ఆసన్నమైంది. ఈ మేరకు మార్చి 5వ తేదీ సాయంత్రం ఆరు గంటలకు జెమిని టీవీ లో మసూద వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కాబోతుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా జరిగింది.
ఈ సినిమాలో హీరోయిన్ సంగీత, తిరువీర్, కావ్యా కళ్యాణ్ రామ్, ముఖ్యపాత్రల్లో నటించారు. శుభలేఖ సుధాకర్, అఖిలా రామ్, సత్యం రాజేష్ కీలకపాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని సాయి కిరణ్ డైరెక్ట్ చేసారు. స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై రాహుల్ యాదవ్ నక్కా నిర్మించారు. దిల్ రాజు గారు ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసారు.