తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఇటీవల తన కొత్త ప్రాజెక్ట్ను నెల్సన్ దిలీప్ కుమార్ తో ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి 'జైలర్' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. తాజాగా ఇప్పుడు, ఈ యాక్షన్-కామెడీ డ్రామాలో కీలక పాత్ర పోషిస్తున్న బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ దర్శకుడు నెల్సన్ దిలీప్కుమార్కు పసుపురంగు వెస్పా స్కూటీని బహుమతిగా ఇచ్చాడు. నెల్సన్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఈ విలువైన బహుమతి చిత్రాన్ని షేర్ చేసారు. ఈ బహుమతి వెనుక కారణాన్నిచిత్ర నిర్మాత వెల్లడించలేదు.
ఈ సినిమాలో మోహన్లాల్, జాకీ ష్రాఫ్, శివ రాజ్కుమార్, సునీల్, తమన్నా భాటియా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానిని సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. అనిరుధ్ రవిచందర్ దీనికి సంగీతం అందిస్తున్నారు.