టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన తదుపరి సినిమాని యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకతంలో చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ యాక్షన్-అడ్వెంచర్ చిత్రానికి తాత్కాలికంగా 'OG' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ పెట్టారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ముంబైలో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా సెట్స్లో బహుముఖ నటుడు ప్రకాష్ రాజ్ జాయిన్ అయ్యారని తాజా సమాచారం. మే 6, 2023 వరకు జరిగే ఈ షెడ్యూల్లో పవన్ మరియు ప్రకాష్ రాజ్ మధ్య కీలక సన్నివేశాలను మూవీ మేకర్స్ చిత్రీకరించనున్నారు అని టాక్.
ఈ పాన్-ఇండియన్ ప్రాజెక్ట్లో ప్రియాంక అరుల్ మోహన్ మహిళా ప్రధాన పాత్రలో నటిస్తుంది. ఈ బిగ్గీకి థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాని డివివి ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది.