ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రముఖ విలన్ మ‌హేష్ ఆనంద్‌ అనుమానాస్పద మృతి..

cinema |  Suryaa Desk  | Published : Sun, Feb 10, 2019, 08:31 PM

90వ దశకంలో తెలుగు సినిమాల్లో విలన్‌గా నటించిన ప్రముఖ నటుడు మహేష్ ఆనంద్‌(57) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ముంబైలోని అంధేరి యారీ రోడ్డులో ఉన్న ఆయన స్వగృహంలో మృతదేహం లభ్యమైంది. కుళ్లిన స్థితిలో ఉన్న ఆయన మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం సమీపంలోని కూపర్ ఆస్పత్రికి తరలించారు. ఆయన మృతికి గల కారణాలు తెలియరాలేదు. ఇంట్లో ఎలాంటి సూసైడ్‌ నోట్‌ లభించలేదు. దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఆయన భార్య మాస్కోలో ఉండటంతో పశ్చిమ అందేరిలోని యారి రోడ్‌లో మహేష్ ఆనంద్‌ ఒంటరిగా ఉంటున్నారని పోలీసులు తెలిపారు. 2002లో భార్యకు విడాకులు ఇచ్చినప్పటి నుంచి ముంబైలో ఆయన ఒంటరిగానే ఉంటున్నారు. తెలుగులో నెంబర్‌ వన్‌, టాప్‌ హీరో, బాలు లాంటి సినిమాల్లో నటించారు మహేష్‌ ఆనంద్‌. అటుపై బాలీవుడ్ బాట పట్టి అక్కడ కూడా విజయవంతమైన సినిమాల్లో నటించారు. స్వర్గ్, శెహన్‌షా, మజ్‌బూర్, కురుక్షేత్ర, తనీదార్, విజేత వంటి సినిమాల్లో విలన్‌గా మెప్పించారు. ఆయన చివరిసారిగా గోవింద హీరోగా నటించిన ‘రంగేలీ రాజా’ సినిమాలో కనిపించారు. 18 ఏళ్ల తర్వాత ఈ సినిమాలో ఆయన నటించగా, అది ఈ ఏడాది జనవరిలో విడుదలైంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa