ప్రస్తుతం దేశంలో బయోపిక్ల జోరు నడుస్తోంది. భాషలకు అతీతంగా టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు బయోపిక్లు వరుసగా విడుదలవుతున్నాయి. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్పై ఇటీవల విడుదలైన ‘యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ సృష్టించిన వివాదం అంతా ఇంతా కాదు. ఇప్పుడు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ జీవితం ఆధారంగా రూపొందించిన ‘మై నేమ్ ఈజ్ రాగా’ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఏప్రిల్లో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంద, అయితే, ఇది జీవిత చరిత్ర కాదని, తనపై జరుగుతున్న ముప్పేట దాడి నుంచి అతడు ఎలా బయటపడగలిగాడనేదే ఈ చిత్రం కథా, కథనమని చిత్ర దర్శకుడు రూపేశ్ పాల్ తెలిపారు. ‘ఈ సినిమాను నేను బయోపిక్గా భావించడం లేదు. ఓటమి, వైఫల్యాలను ధైర్యంగా ఎదుర్కొన్న వ్యక్తికి సంబంధించిన కథ ఇది. దీనిని నేను బయోపిక్ అనను. జీవితంలో తీవ్రమైన ఒడిదొడుకులు ఎదుర్కొన్న వ్యక్తి విజయం సాధించిన తర్వాత అతడిని ఆపడం సాధ్యం కాదు.. ఇదే సినిమా కథ’ అని దర్శకుడు తెలిపాడు. కాగా, తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ప్రకంపనలు సృష్టిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa