ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాలినడకన ఏడుకొండలు ఎక్కిన సమంత

cinema |  Suryaa Desk  | Published : Tue, Apr 02, 2019, 11:37 AM

నటి సమంత కాలి నడకన ఏడుకొండలు ఎక్కి  తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. టాలీవుడ్ లో మంచి నటిగా పేరు తెచ్చుకున్న అక్కినేని వారి కోడలు భక్తి ప్రపత్తులతో కాలినడకన తిరుమలకు చేరుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. కాగా నాగచైతన్య-సమంత జంటగా నటించిన మజిలీ సినిమా ఏప్రిల్  5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో శ్రీవారి దర్శనం కోసం సినిమా యూనిట్ తిరుమల చేరుకుంది. చిత్ర బృందం మొత్తం కారులో కొండపైకి చేరుకుంటే.. సమంత మాత్రం సామాన్య భక్తులతో కలిసి నడిచి కొండపైకి చేరుకున్నారు. 


వెండితెరపై వెలిగిపోయే హీరోయిన్ హఠాత్తుగా మన పక్కనే ప్రత్యక్షమైతే..మనతో పాటు నడిస్తే..కబుర్లు చెబుతు..సరదా సరదాగా కలిసి నడిస్తే ఎలా ఉంటుంది. ఇటువంటి అనుభూతికి లోనయ్యారు తిరుమల నడకదారిలో నడుస్తున్న భక్తులు. ఓ సాధారణ వ్యక్తిలా తమతో నడుస్తున్న సమంతను చూసి భక్తులు ఆనందాశ్చర్యాలకు లోనయ్యారు. టాలీవుడ్ టాప్ హీరోయిన్  సమంతతో పాటు నడుస్తు..ఆమెతో మాట్లాడుతూ, సెల్ఫీలు దిగుతూ  సందడి చేశారు. అలా నడుస్తూ సరిగ్గా రాత్రి పది గంటలకు ఆమె కొండపైకి చేరుకున్నారు. సమంత మెట్ల దారిలో కొండపైకి వెళ్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa