ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అవార్డు రాకపోయినా వచ్చిన నష్టమేమీ లేదు: తాప్సి

cinema |  Suryaa Desk  | Published : Sun, Apr 07, 2019, 09:43 PM


కళాకారులు కోరుకునేది గుర్తింపు. తాము పడ్డ కష్టానికి అవార్డులు, రివార్డులు బూస్టును ఇస్తాయని అంటారు. తమ ప్రతిభను మరింత పదును పరుచుకోవడానికి పురస్కారాలు ఎంతో ఉపయుక్తమ వుతాయని అంటారు. స్టైలిష్‌ అవార్డ్స్‌ వేడుకకు తాప్సి హాజరయ్యారు.  ఈ సందర్భంగా తనకు రాని అవార్డుల గురించి స్పందించింది. తాను పడ్డ కష్టానికి ఇంతవరకు ఒక్క అవార్డు రాకపోవడం.. బహుశా తాను అవార్డలుకు అనర్హురాలినేమో అని నిరాశను వ్యక్తపరిచింది తాప్సి. తెలుగులో ‘ఝుమ్మంది నాదం’ సినిమాతో తెరంగేట్రం చేసి తెలుగులో కొన్ని సినిమాల్లో నటించి, బాలీవుడ్ బాట పట్టింది. అక్కడ తను చెప్పుకోదగ్గ మంచి సినిమాల్లోనే నటించింది. నటిగా బాలీవుడ్‌లో తన పాగా నాటుకుంది. తనకన్నా ముందు బాలీవుడ్‌కు వెళ్లి తమన్నాను దాటి వెళ్లిపోయింది తాప్సి.‘పింక్, జుడ్వా, ముల్క్ వంటి రూ.100 కోట్ల సినిమాల్లో నటించాను. నటిగా అందరూ నాకు నూటికి నూరుపాళ్లు మార్కులు వేశారు. కానీ అవార్డులు నా జాతకంలో రాసిపెట్టి లేవేమో. అవి రావడంలేదని నాకు బాధ గానీ, కోపం గానీ లేవు. తొలుత నాకు అవార్డులు రాకపోతే నేను బాలీవుడ్‌కు కొత్త కదా అనుకున్నాను. పైగా నేను నటించిన సినిమాలు రూ.100 కోట్ల బడ్జెట్‌లో రాలేవని అనుకున్నాను. కానీ ఆ తర్వాత నేను నటించిన సినిమాలు ఆ బడ్జెట్ సినిమాలే. పైగా సూపర్ హిట్టయ్యాయి. అయినా ఏం ఫర్వాలేదు. నేను సంతోషంగానే బతకగలను. అవార్డు రాకపోయినా వచ్చిన నష్టమేమీ లేదు. అది తెలుసుకోవడానికి నాకు రెండేళ్లు పట్టింది. అందరినీ ఓ ప్రశ్న అడగాలని అనుకుంటున్నాను. అవార్డు వస్తేనే మనం బాగా పనిచేశామని ఎవరన్నారు? నాకు మంచి నటి అనే ప్రశంసలైతే దక్కుతున్నాయి కదా. దానిని మీరు గుర్తించలేదు. మున్ముందు ఇంకా మంచి చిత్రాల్లో నటిస్తా’ అని వెల్లడించింది తాప్సి. ప్రస్తుతం ఆమె ‘సాండ్‌ కీ ఆంఖ్‌’ అనే చిత్రంలో నటిస్తోంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa