విశ్వవిఖ్యాత నటసౌర్వభౌమ నందమూరి తారకరామారావు జీవిత నేపథ్యాన్ని వెండితెరపై ఆవిష్కరించేందుకు దర్శకులు పోటి పడుతున్నారు. ముందుగా ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ తన తండ్రి జీవిత నేపథ్యంలో బయోపిక్ చేస్తానని ప్రకటించగానే, కొద్ది రోజులకే సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో బయోపిక్ చేస్తున్నట్టు స్టేట్ మెంట్ ఇచ్చాడు. లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ జీవితంలోకి వచ్చిన దగ్గర నుంచి, తాను చనిపోయే వరకు ఏం జరిగాయనే విషయాలని తన సినిమాలో చూపిస్తానని వర్మ అన్నాడు. ఇక బాలయ్య ప్రధాన పాత్రలో రూపొందనున్న ఎన్టీఆర్ బయోపిక్ ని తేజ తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి ఎన్టీఆర్ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు.
ఇప్పటికే ఎన్టీఆర్ బయోపిక్ కి సంబంధించి తెలుగు రాష్ట్రాలలో భారీ చర్చలు జరుగుతున్న నేపథ్యంలో తమిళ నాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతి రెడ్డి జగదీశ్వర్ రెడ్డి తాను ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా సినిమాని రూపొందిస్తున్నట్టు ప్రకటించాడు. ఈ సినిమాకి లక్ష్మీస్ వీరగ్రంధం అనే టైటిల్ ఫిక్స్ చేశారు. తమిళంలో ఈ చిత్రాన్ని రూపొందించి తెలుగులోకి అనువదించనున్నాడు. తాజాగా చిత్రానికి సంబంధించి లోగో విడుదల చేసిన ఆయన లక్ష్మీ పార్వతి పాత్ర కోసం నటీమణిని వెతుకుతున్నట్టు తెలిపాడు. వాణీ విశ్వనాథ్ కాని, రాయ్ లక్ష్మీలలో ఎవరో ఒకరిని ఆ పాత్రకి ఎంపిక చేస్తామని అన్నాడు. వారిరివురు ఒప్పుకోపోతే పార్వతి మిల్టన్ ని అంగీకరింపజేయడానికి నిర్మాత విజయకుమార్ గౌడ్ ప్రయత్నాలు చేస్తున్నారట.
నవంబర్ లో రెగ్యులర్ షూటింగ్ కి వెళుతున్నామని చెప్పిన కేతి రెడ్డి ఈ చిత్రాన్ని 2018లో విడుదల చేస్తామని కూడా ప్రకటించారు. దాంతో ఈ సినిమాపై అందరి దృష్టి నెలకొంది. మరి ఎన్టీఆర్ జీవితనేపథ్యానికి సంబంధించి రూపొందున్నీ ఈ బయోపిక్ లలో ఏ చిత్రాన్ని ఆడియన్స్ మెచ్చుతారో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa