అవును.. వినడానికి కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఇప్పుడు అనసూయ చేసిందిదే. నిజంగానే ఈ భామ శవాల మధ్యలో కూర్చుంది. అంత అవసరం ఏమొచ్చింది అనుకుంటున్నారా..? ప్రస్తుతం ఈమె వరస సినిమాలతో బిజీగా ఉంది. ఒక్కో సినిమాతో తన ఇమేజ్ పెంచుకుంటూ వెళ్తుంది. అసలు ముందు ఈమెను నటిగా కూడా ఎవరూ చూడలేదు. కేవలం గ్లామర్ షో మాత్రమే చేసి ఇమేజ్ తెచ్చుకుంది అనసూయ. కానీ క్షణం సినిమా తర్వాత తనలో నటి కూడా ఉందని నిరూపించుకుంది ఈ ముద్దుగుమ్మ.
ఇక ఆ తర్వాత సపోర్టింగ్ రోల్స్ చేస్తూ ఇప్పుడు మెయిన్ లీడ్ చేసే స్థాయికి వచ్చేసింది. తాజాగా ఈమె నటిస్తున్న కథనం పోస్టర్ విడుదలైంది. దీనికోసమే శవాల మధ్యలో కూర్చుంది అనసూయ. రంజాన్ సందర్భంగా ఈ పోస్టర్ విడుదలైంది. కుర్చీలో కూర్చుని ఉంటే ముందు శవాలుంటాయి. కథనం సినిమాలో అసిస్టెంట్ డైరెక్టర్ పాత్రలో నటిస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఈ చిత్ర టీజర్ చూస్తుంటే తెలియకుండానే 16 ఏళ్ల కింద వచ్చిన ఏ ఫిల్మ్ బై అరవింద్ కథను గుర్తు చేస్తుంది.
ఇందులో అనసూయ రైటర్ పాత్రలో నటిస్తుంది. ఆమె రాసిన కథ బయట జరుగుతుంది. అక్కడ గజల్ శ్రీనివాస్ రాసిన కథే బయట కూడా జరుగుతుంటుంది. ఇక్కడ కూడా కథలో మర్డర్ జరుగుతుందని రాస్తే.. బయట కూడా జరుగుతుంది. ఆ మర్డర్ మిస్టరీ చుట్టూ కథనం కథ అల్లుకున్నాడు దర్శకుడు రాజేష్ నాదెండ్ల. ఇందులో ఏకంగా ఫైటింగ్స్ కూడా చేస్తుంది అనసూయ. ఇది చాలా సీరియస్ రోల్.
ఇప్పటి వరకు ఈమె చేయని పాత్ర ఇది.. పైగా సినిమా అంతా ఈమె భుజాలపై నడుస్తుంది. నిర్ణయాలు తీసుకునేవాళ్లు నిద్రపోయినపుడు.. ఎవరో ఒకరు మేల్కొంటారు సర్ అని శ్రీనివాస్ అవసరాల చెప్పిన డైలాగ్ బట్టి చూస్తుంటే ఇందులో అనసూయ కారెక్టర్ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ధనరాజ్, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ అవసరాల ఇందులో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సినిమా త్వరలోనే విడుదల కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa