ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'సీతా పయనం' ఆన్ బోర్డులో ప్రముఖ రైటర్

cinema |  Suryaa Desk  | Published : Sat, Feb 22, 2025, 03:10 PM

ప్రముఖ డైరెక్టర్ మరియు నటుడు యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా "సీతా పయనం"తో దర్శకత్వానికి తిరిగి వచ్చాడు. కన్నడలో ప్రాథమికంగా చిత్రీకరించనున్న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో కూడా విడుదల కానుంది. ఈ సినిమాలో నిరంజన్ కథానాయకుడుగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో నిరంజన్ కి జోడిగా ఐశ్వర్య అర్జున్ నటిస్తుంది. ఇటీవలే ఆవిష్కరించబడిన టైటిల్ లోగో కథలోని ఎమోషనల్ కోర్‌ని సూచిస్తుంది. ప్రధాన తారాగణం ఇంకా ప్రకటించబడనప్పటికీ, అర్జున్ సర్జా తన శ్రీ రామ్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా ఆన్ బోర్డులో ప్రముఖ రైటర్ సాయి మాధవ్ ఉన్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ సినిమాలో సత్య రాజ్, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకి కెమెరా మ్యాన్ గా బలమురుగన్, ఎడిటర్ గా అయూబ్ ఖాన్ ఉన్నారు. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa