ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రెబల్ స్టార్ కు ఫోన్ చేసిన మెగాస్టార్

cinema |  Suryaa Desk  | Published : Sun, Aug 11, 2019, 09:17 PM

సాహో చిత్రం గురించి మెగాస్టార్ చిరంజీవి తనకు ఫోన్ చేశారని టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ చెప్పారు.  ఆయన ఫోన్ చేయడంతో షాక్ తిన్నానని.. ఎక్స్‌ట్రాన్డరీ అన్నారు ప్రభాస్. మొత్తంగా గ్రేట్ ఫీలింగ్ అయ్యాయన్నారు. ఆయన నటించిన చిత్రం సాహో ఆగస్టు 30వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా చిత్ర యూనిట్ ప్రమోషన్స్ నిర్వహిస్తోంది. 2019, ఆగస్టు 11వ తేదీన హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్ మీట్ కార్యక్రమంలో హీరో ప్రభాస్, హీరోయిన్ శ్రద్దా కపూర్, ప్రొడ్యూసర్స్ పాల్గొన్నారు. 
సినిమాకు సంబంధించిన విశేషాలను వారు తెలియచేశారు. అనుకున్న బడ్జెట్‌లోనే సినిమా అవుతుందని అనుకున్నా..క్వాలిటీ విషయంలో రాజీ పడలేదని..అందుకే బడ్జెట్ పెరిగిందన్నారు. ఇండియా వైడ్ ఇంత పెద్ద రెస్పాన్స్ వస్తుందని అనుకోలేదన్నారు ప్రభాస్. బాహుబలి రిజల్ట్ తర్వాత..దాని ప్రభావం దానిపై పడిందన్నారు. సినిమా చూసిన తర్వాత ట్రైలర్ కట్ చేయడం ఎంత కష్టమో మీకే తెలుస్తుందన్నారు. ఒకే ఒక్క సీన్ ఐదారుసార్లు వస్తుందని.. ఇది చాలా డిఫికల్ట్ సీన్ అని తెలిపారు. ఈ సీన్ చేయడంలో సుజిత్ సక్సెస్ అయ్యాడని..అందుకే నమ్మకం కలిగిందన్నారు. సాహోలో నటించడం ఆనందంగా ఉందన్నారు శ్రద్ధా. స్టోరీ విన్న తరువాత గొప్ప పాత్ర లభించిందనే ఆనందం కలిగిందన్నారు. ఈ సినిమాలో తనకు అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్లు తెలిపారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa