by Suryaa Desk | Mon, Aug 12, 2024, 07:36 PM
హరీశ్ రావుకు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. రుణమాఫీ సమస్యలపై బీఆర్ఎస్ హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు చేయడాన్ని తప్పుబట్టారు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడే ఈ పని చేసి ఉంటే రైతులకు మేలు జరిగేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతీ రైతుకు లబ్ది చేకూర్చుతుందని తెలిపారు. సాంకేతిక సమస్యల వల్ల రుణమాఫీ కాకపోయినా ఆగస్టు 15 తర్వాత వాటిని పరిష్కరిస్తామని వెల్లడించారు.