ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కంటోన్మెంట్ ఉప ఎన్నిక,,,,హస్తం నుంచి బరిలో శ్రీ గణేష్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Apr 07, 2024, 07:27 PM

సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించింది. లాస్య నందిత ఆక్మసిక మృతితో ఖాళీ అయిన ఈ స్థానానికి అభ్యర్థిగా శ్రీ గణేష్‌ను ప్రకటించారు. ఈ మేరకు కాంగ్రెస్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి నుంచి బీజేపీ తరపున పోటీ చేసిన శ్రీ గణేష్ పది రోజుల క్రితమే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. తాజాగా.. ఆయన్ను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు.


కాగా, ఈ ఏడాది ఫిబ్రవరి 23న కంటోన్మెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే లాస్య నందిత కారు ప్రమాదంలో మృతి చెందారు. పటాన్‌చెరు శివారు ఓఆర్ఆర్‌పై ఆమె ప్రయాణిస్తున్న కారు రెయిలింగ్‌ను ఢీకొట్టడటంతో స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయారు. ఆమె మృతితో కంటోన్మెంట్‌కు బైపోల్ అనివార్యమైంది. అయితే మృతి చెందిన ఎమ్మెల్యే కుటుంబానికి చెందిన వారికి టికెట్ కేటాయిస్తే.. ప్రత్యర్థి పార్టీలు పోటీ నుంచి తప్పుకుంటాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సంప్రదాయం కొనసాగుతోంది. అయితే దుబ్బాక, నాగార్జున సాగర్ బై పోల్ సమయంలో ఈ అనవాయితీని పక్కన పెట్టారు. తాజాగా కంటోన్మెంట్ నుంచి తాను బరిలో ఉంటాని లాస్య నందిత సోదరి నివేదిత ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆమె పోటీపై బీఆర్ఎస్ ప్రకటన చేయకముందే కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించింది.


2023 అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీ గణేష్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆయనకు 41,888 ఓట్లు రాగా.. లాస్య నందితకు 59,057 ఓట్లు పోలయ్యాయి. 17,169 ఓట్ల తేడాతో శ్రీగణేష్ ఓటమి పాలయ్యారు. ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రజాయుద్దనౌక గద్దర్ కుమార్తె వెన్నల పోటీ చేయగా.. ఆమె ఓటమి చవి చూశారు. మరోసారి కాంగ్రెస్ ఆమెకు అవకాశం ఇస్తుందని భావించగా.. అనుహ్యంగా ఇటీవల పార్టీలో చేరిన శ్రీ గణేష్‌కు పార్టీ టికెట్ కేటాయించారు. కాగా ఈ ఉప ఎన్నిక కూడా పార్లమెంట్ ఎన్నికలతో పాటే జరగనుంది. మే 13న పోలింగ్.. జూన్ 4న ఫలితాలు వెల్లడి కానున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa