తెలంగాణలో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. నిప్పుల వర్షం కురిపిస్తుండటంతో ఉదయం 7 గంటల తర్వాత బయటకు వెళ్లాలంటే జనం జంకుతున్నారు. ఏప్రిల్ మొదటి వారం నుంచే వడగాలులు తీవ్రస్థాయిలో వీస్తుండటంతో జనం బెంబేలెత్తుతున్నారు. అధిక ఉష్ణోగ్రతలతో అన్ని జిల్లాల్లు అతలాకుతలం అవుతున్నాయి. గడిచిన పదేళ్ల రికార్డులు పరిశీలిస్తే ఏప్రిల్లో ఈ స్థాయి వడగాలులు నమోదుకావడం ఇదే మొదటిసారి అని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
ఇదిలా ఉండగా.. హైదరాబాద్ వాతావరణ కేంద్రం మండు వేసవిలో చల్లని కబురు చెప్పింది. రానున్న ఐదు రోజులు తెలంగాణ అంతటా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. ప్రస్తుతం ఉన్న ఎండ తీవ్రత తగ్గే ఛాన్స్ ఉందని చెప్పారు. నేటి నుంచి ఈనెల 12 వరకు రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హైదరాబాద్ సెంటర్ అధికారులు వెల్లడించారు.
నేడు ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్ సహా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసే ఛాన్స్ ఉందని చెప్పారు. ములుగు, మహబూబాబాద్, జనగామ, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, హన్మకొండ, వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లో ఈనెల 9 వరకు వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు. ఏప్రిల్ 10న నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్, మంచిర్యాల, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. ఇక హైదరాబాద్లో పొడి వాతావరణం ఉంటుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఎండ తీవ్రత కొద్దిగా తగ్గే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. మాడు పగిలే మండు వేసవిలో ఈ చల్లని కబురు తెలంగాణ ప్రజలకు ఊరట కలిగిస్తుందని వాతావరణశాఖ అధికారులు అంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa