ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, May 18, 2024, 04:52 PM

సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై గణేష్ అన్నారు. శుక్రవారం దోమకొండ మండల కేంద్రంలోని కెనరా బ్యాంక్ కార్యాలయంలో బ్యాంకు సిబ్బందితో కలిసి ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఖాతాదారులు ఫోన్లకు వచ్చే ఓటీపీలను ఇతరులకు చెప్పవద్దన్నారు. బ్యాంకు లావాదేవీల విషయంలో డైరెక్ట్ గా బ్యాంకుకు వచ్చి సంప్రదించాలన్నారు. ఏఎస్ఐ సుబ్రహ్మణ్యచారి, కానిస్టేబుల్ భూమయ్య, ప్రభాకర్, మహిళా కానిస్టేబుల్ సౌజన్య ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa