తెలంగాణలో గతకొద్దిరోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. సాధారణంగా మే నెలలో ఎండలు కాయాల్సిందిపోయి వర్షాలు కురుస్తున్నాయి. ఇది వర్షాకాలమా ? అని సందేహం కలిగేలా గత రెండు వారాల నుంచి ప్రతిరోజూ తెలంగాణలోని ఏదో ఒక మూల వర్షం కురుస్తోంది. ఆదివారం సాయంత్రం హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి.
కాగా, తాజాగా తెలంగాణకు మరోసారి రెయిన్ అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. నేడు, రేపు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని చెప్పింది. రెండ్రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పారు. ఈ మేరకు వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. భారీ ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందన్నారు. గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయన్నారు. పిడుగులు పడే అవకాశం ఉందని జాగ్రత్తగా ఉండాలన్నారు.
నేడు ప్రధానంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, నల్గొండ, రంగారెడ్డి, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, నాగర్ కర్నూల్, వనపర్తి, జనగామ, జోగులాంబ గద్వాల, మహబూబాబాద్, హనుమకొండ, వరంగల్, నారాయణపేట, మంచిర్యాల, యాదాద్రి భువనగిరి, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్లోనూ సాయంత్రం తర్వాత వర్షం కురిసే ఛాన్స్ ఉందని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa