ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మద్యంప్రియులకు బ్యాడ్ న్యూస్.. రేపటి నుంచి 3 రోజులు వైన్ షాపులు బంద్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, May 24, 2024, 07:14 PM

మందుబాబులకు మరోసారి బ్యాడ్ న్యూస్ వినిపించింది ఎన్నికల సంఘం. మొన్ననే లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరిగిన నేపథ్యంలో రెండు రోజుల పాటు వైన్ షాపులు, బార్లు మూసేయగా.. ఇప్పుడు మరోసారి మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. జూన్ 4తేదీన లోక్ సభ ఎన్నికల ఫలితాలు వెలువడనున్న సందర్భంగా ఆరోజు కూడా వైన్ షాపులు మూసేయనున్నారు. అయితే.. ఈ మధ్యలో కూడా మరోసారి మద్యం దుకాణాలకు ఓ రోజంతా తాళాలు పడనున్నాయి. సోమవారం రోజున (మే 27వ తేదీ) ఉమ్మడి వరంగల్- నల్గొండ- ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మె్ల్సీ ఉప ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఆ రోజున కూడా వైన్ షాపులతో పాటు బార్లు బంద్ చేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.


అయితే.. నల్గొండ- ఖమ్మం- వరంగల్ జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది ఎన్నికల సంఘం. ఈనెల 27న వరంగల్‌, నల్గొండ, ఖమ్మం ఉమ్మడి జిల్లాల పట్టభద్రులు ఎమ్మెల్సీ ఉపఎన్నికలో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ క్రమంలోనే 27వ తేదీన మద్యం దుకాణాలు మూసేయాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖకు ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.


అయితే.. మే 27న ఎన్నికల పోలింగ్ జరిగే మూడు జిల్లాల్లో వైన్స్ షాపులు, బార్లను 48 గంటల పాటు బంద్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఉప ఎన్నిక నేపథ్యంలో రేపు (మే 25) సాయంత్రం 4 గంటల నుంచి 27న సాయంత్రం 4 గంటల వరకు వైన్ షాపులు, బార్లు బంద్ కానున్నాయి. ఇదిలా ఉంటే.. ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికను రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోగా.. అదే స్థాయిలో ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు. ఉపఎన్నిక బరిలో ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు మొత్తం 52 మంది అభ్యర్థులు నిలబడ్డారు. అయితే.. 3 ఉమ్మడి జిల్లాల్లో కలిపి మొత్తం 4,61,806 మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa