ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డిపో మేనేజర్ గొప్ప మనసు.. గ్రూప్-1 అభ్యర్థిని పరీక్షా కేంద్రానికి చేర్చిన అధికారి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 10, 2024, 07:45 PM

తెలంగాణలో గ్రూప్‌-1 సర్వీసుల పోస్టులకు ఆదివారం (జూన్ 9) ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష నిర్వహించారు. అయితే.. పరీక్ష రాసేందుకు వచ్చిన ఓ అభ్యర్థి పట్ల ఆర్టీసీ డిపో మేనేజర్ పెద్ద మనసు చాటుకున్నారు. అడ్రస్ తెలియక మరో బస్‌స్టాప్‌లో దిగిపోగా.. పరీక్షకు సమయం దగ్గరపడటంతో సొంత కారులో ఆమెను పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లాడు.


వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ జీడిమెట్ల చెందిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రాసేందుకు ఆదివారం ఇంటి నుంచి బయల్దేరారు. ఆమెకు సుల్తాన్ బజార్‌లోని ప్రగతి మహా విద్యాలయంలో ఎగ్జామ్ సెంటర్ పడింది. అయితే ఆమె కోఠిలో బస్సు దిగాల్సిందిపోయి.. పొరపాటున అబిడ్స్ చర్మాస్ వద్ద బస్సు దిగింది. అప్పటికే పరీక్షా సమయం మించిపోతుండటంతో కంగారుపడుతుండగా.. అక్కడే విధులు నిర్వహిస్తున్న కాచిగూడ ఆర్టీసీ డిపో మేనేజర్‌ రఘు గమనించాడు. ఆమె వివరాలు తెలుసుకొని పెద్ద మనసుతో తన కారులో ఆమెను సమయానికి పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లారు. పరీక్షకు ఓ పది నిమిషాల ముందే సెంటర్‌కు తీసుకెళ్లటంతో నిషితను అధికారులు హాల్లోకి అనుమతించారు. దీంతో మేనేజర్‌ రఘుకు నిషిత కృతజ్ఞతలు తెలిపారు. ఇక పకడ్బందీ ఏర్పాట్ల మధ్య రాష్ట్రవ్యాప్తంగా 897 కేంద్రాల్లో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరిగింది. పరీక్షకు మొత్తం 4.03 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. 3.02 లక్షల మంది హాజరైనట్లు టీజీపీఎస్సీ అధికారులు వెల్లడించారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa