రాళ్ల లోడుతో వెళుతున్న ట్రాక్టర్ బోల్తా పడి పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన ఆదివారం మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం అల్లిపూర్-కురుమూర్తి గ్రామాల మధ్య జరిగింది. స్థానికుల కథనం మేరకు రాళ్ల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ డ్రైవర్ అతివేగంగా ముందున్న వాహనాన్ని అధిగమించేందుకు ప్రయత్నించి అదుపుతప్పి ట్రాలీ బోల్తా పడింది. ఈ క్రమంలో డ్రైవర్ పక్కకు దూకడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa