కట్టుకున్న భార్య, 11 నెలల కన్న కూతుర్ని ఓ వ్యక్తి సికింద్రాబాద్ బోయినపల్లిలో దారుణంగా హత్య చేశాడు. అనంతరం తాను కూడా ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని న్యూ బోయిన్పల్లి పెద్దతోకట్టలో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గణేష్, స్వప్న దంపతులు. వీరి ముగ్గురు కుమార్తెలు సంతానం. గణేష్ డ్రైవర్గా పని చేస్తుండగా.. కుటుంబంతో సహా.. న్యూ బోయిన్ పల్లి పెద్దతోకట్టలో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు.
అయితే గత కొద్దిరోజులుగా భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. శనివారం రాత్రి కూడా దంపతుల మధ్య గొడవలు జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆదివారం తెల్లవారుజామున గణేష్ తన భార్య స్వప్న, చిన్న కుమార్తె నక్షత్రలను గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం 100కు కాల్ చేసి జరిగిన విషయం చెప్పాడు. తాను కూడా చనిపోతున్నట్లు పోలీసులకు వెల్లడించారు. అప్రమత్తమైన పోలీసులు గణేష్ ఇంటికి వెళ్లి చూసే సరికి భార్య, కుమార్తె విగతజీవులుగా పడి ఉన్నారు. గణేష్ అల్వాల్లోని ఓ రైల్వే ట్రాక్పై పడుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
హత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. గత కొంత కాలంగా భార్యపై గణేష్ అనుమానం పెంచుకున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో ఆమెను హత్య చేసి ఉండవచ్చుననే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అయితే ఇంట్లోనే ఉన్న 3,4 ఏళ్ల వయస్సు ఉన్న ఇద్దరు కూతుళ్లను గణేష్ వదిలేసి 11 నెలల వయస్సున్న చిన్న కూతురిని మాత్రమే చంపేశాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అన్ని కోణాల్లోనూ దర్యా్ప్తు చేస్తున్నారు. కాగా, తల్లిదండ్రులను కోల్పోయి ఇద్దరు చిన్నారులు అనాథలుగా మారారు. వీరి దీనస్థితిని చూసిన స్థానికులు కంటతడి పెట్టుకుంటున్నారు. క్షణికావేశంలో హత్యలు చేసి ఇద్దరు పిల్లలను అనాథలను చేశారని స్థానికులు గణేష్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే హత్యలకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనా స్థలానికిచేరుకున్న పోలీసు ఉన్నతాధికారులు మృతదేహాలను పరిశీలించారు. అనంతరం బంధువులకు సమాచారం అందించి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa