ఇందిరమ్మ ఇళ్ల పథకంపై గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక కామెంట్స్ చేశారు. తెలంగాణ మండలి సమావేశాల్లో భాగంగా ఇవాళ ప్రశ్నోత్తరాల సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికలకు రెండు నెలల ముందు జీవో నెంబర్ 25 ద్వారా గృహ నిర్మాణానికి 3 లక్షలు కేటాయించదని మంత్రి పొంగులేటి వెల్లడిచారు. ఈ పథకం కింద 496 ఇళ్లకు ఫౌండేషన్ వేసిందని తెలిపారు. అయితే ఇప్పుడు ఆ జీవోను రద్దు చేస్తున్నట్లు చెప్పారు. ఆ 496 ఇళ్లకు కూడా రూ.3 లక్షలకు బదులుగా రూ. 5 లక్షలు ఇస్తూ.. ఇందిరమ్మ ఇళ్లు నిర్మించనున్నట్లు వెల్లడించారు.
మంత్రి సమాధానంపై ఎమ్మెల్సీ తాతా మధు సప్లిమెంటరీ ప్రశ్న లేవనెత్తుతూ.. మంత్రి తెలిపిన సంఖ్య వాస్తవానికి దూరంగా ఉందని అన్నారు. ఎమ్మెల్సీ మధు ప్రశ్నకు పొంగులేటి కౌంటర్ ఇచ్చారు. అది తాము తయారు చేసిన జాబితా కాదని.. గత ప్రభుత్వం నుంచి అధికారులు సేకరించని డేటా అని వెల్లడించారు. దానికి సంబందించిన లిస్ట్ను మంత్రి సభలో చదివి వినిపించారు.
ఇక ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు 2006-2014 వరకు తెలంగాణలో దాదాపు 19 లక్షలకుపైగా ఇందిరమ్మ ఇళ్లను పూర్తి చేసిందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల కాలంలో కేవలం 1,36,116 ఇళ్లు మాత్రమే పూర్తి చేసినట్లు తెలిపారు. పేద వాళ్లలో బహు పేదవాళ్లకే ఇళ్లు ఇవ్వాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం ముందుకు వెళుతోందని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa