ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ముఖ్యమంత్రి అవుతాను.. అసెంబ్లీలో కోమటిరెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 24, 2024, 09:31 PM

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీ వేడీగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే.. మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చర్చలో భాగంగా.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రశాంత్ రెడ్డి, మల్లారెడ్డి, గంగుల కమలాకర్, పల్లా రాజేశ్వర్ రెడ్డి మధ్య ఇంట్రెస్టింగ్ సంభాషణ జరిగింది.


బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కౌంటర్ ఇచ్చే క్రమంలో.. గేమ్ ఇప్పుడే స్టార్ట్ అయిందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. జైలుకు వెళ్లే బీఆర్ఎస్ నాయకుల లిస్టులో.. ఉమ్మడి నల్గొండ జిల్లా మాజీ మంత్రి మొదటి వ్యక్తి అని కోమటిరెడ్డి కామెంట్ చేశారు. మరోవైపు.. తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారంటూ బీఆర్ఎస్ నేతలు ఆరోపించగా.. దానికి కూడా కోమటిరెడ్డి తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.


ప్రశాంత్ రెడ్డి లాంటి నాయకులకు తాము కొనలేమన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. గతంలో కేసీఆర్ మాత్రం 20, 30 కోట్లు ఇచ్చి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొన్నారని ఆరోపించారు. తాము మాత్రం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను 5, 10కి మాత్రమే అడుగుతున్నామని తెలిపారు. అందుకే.. ఇంకా 26 ఎమ్మెల్యేలు తమ దగ్గరికి రాలేదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.


మరోవైపు.. రూ.300 కోట్లు ఖర్చు పెట్టి మునుగోడు ఉపఎన్నికలో తనపై గెలిచారని.. కర్ణుడిని ఒడించినట్టుగా తనను ఓడించారని కోమటిరెడ్డి చెప్పుకొచ్చారు. మునుగోడు ఉపఎన్నిక ఎఫెక్ట్ బీఆర్ఎస్‌ పార్టీపై గట్టిగా పడిందని తెలిపారు. అందుకే.. కేసీఆర్ అధికారం కోల్పోయారన్నారు. ఈ క్రమంలోనే.. తనకు మంత్రి పదవి వస్తుందా లేదా అంటూ బీఆర్ఎస్ నేతలు పదే పదే చేసే కామెంట్లపై కోటమటిరెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తాను మంత్రి పదవి కోసం పైరవీలు చేయనని.. అయ్యేదుంటే డైరెక్టుగా ముఖ్యమంత్రినే కావొచ్చంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa