తెలంగాణలో గత కొన్ని రోజులుగా అన్ని జిల్లాల్లోనూ రెండ్రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. జోరు వానలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. జలాశయాలు, బ్యారేజీలు, ప్రాజెక్టులు జలకలను సంతరించుకున్నాయి. హైదరాబాద్ నగరంలోని నాలాలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాలని డిమాండ్ వినిపిస్తోంది. ఈ మేరకు తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు.
అనేక ప్రాంతాల్లో నాలాలు, చెరువులు, వాగులు, వంకలు, జలాశయాలు పొంగిపొర్లుతుండటంతో విద్యార్థులు కాలేజీలు, పాఠశాలలకు వెళ్లలేని పరిస్థితి నెలకొందని అంటున్నారు. విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని రెండు, మూడ్రోజులు సెలవులు ప్రకటించాలని కోరారు. కాగా, భారీ వర్షాల నేపథ్యంలో ఇప్పటికే ఏపీలో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. భారీ వర్షాలు కురుస్తున్న పలు జిల్లాల్లో స్థానిక అధికారులు సెలవులను డిక్లేర్ చేశారు. ఇదే మాదిరిగా తెలంగాణలోనూ సెలవులు ప్రకటించాలని తల్లిదండ్రుల నుంచి కూడా డిమాండ్ వినిపిస్తోంది.
కాగా, తెలంగాణలో మరో మూడ్రోజుల పాటు భారీ వర్షాలు కురుసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరించారు. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. పది జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందన్నారు. ఉరములు, మెరుపులతో పాటు భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసే ఛాన్స్ ఉందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అవసరం అయితేనే బయటకు వెళ్లాలని అధికారులు సూచించారు. ఇక హైదరాబాద్ నగరానికి కూడా అధికారులు రెయిన్ అలర్టా జారీ చేశారు. ఉదయం వాతావరణం పొడిగా ఉన్నా.. మధ్యాహ్నం సమయంలో వర్షం కురిసే ఛాన్స్ ఉందన్నారు.
నగరంలో డ్రైనేజీలు పొంగి పొర్లుతున్న నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. వర్షం కురిసే సమయంలో జాగ్రత్తగా ఉండాలని.. తెలియని దారుల్లో వెళ్లకూడదని చెబుతున్నారు. మ్యాన్ హోల్స్ మూతలు తెరిచి ఉండ కూడదని.. నాలాలకు సమీపాల్లో ఉండే నివాసితులు జాగ్రత్తగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa