ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అక్క దగ్గరకు బయల్దేరిన తమ్ముడు.. అతని స్నేహితులను బలిగొన్న రోడ్డు ప్రమాదం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 13, 2024, 04:35 PM

హైదరాబాద్ - మహానగర పరిధి సైదాబాద్, శంకేశ్వర్బజార్, సాయిరాం కాలనీకి చెందిన సందీప్(20), అభిలాష్(20), శ్రీహరి(20) ప్రాణ స్నేహితులు. అభిలాష్ సోదరి అమరావతి రాజేంద్రనగర్ పరిధి శివరాంపల్లిలో అత్తారింట్లో నివసిస్తోంది. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన ఆమె మామకు సోమవారం శస్త్ర చికిత్స జరగాల్సి ఉండటంతో భర్త సహా కుటుంబ సభ్యులు ఆసుపత్రికి వెళ్లారు. ఒంటరిగా ఉన్న తనకు తోడుగా రావాలని ఆమె తమ్ముడిని కోరింది. దీంతో అభిలాష్ ఇద్దరు స్నేహితులతో కలిసి బైక్ పై శివరాంపల్లికి బయలుదేరాడు. చాంద్రాయణగుట్ట నుంచి బండ్లగూడ వైపు వెళుతుండగా హాషామాబాద్ షాదన్ హోటల్ వద్ద వాహనం అదుపుతప్పి డివైడర్ ను ఢీకొంది. ప్రమాదంలో అభిలాష్, సందీప్ అక్కడికక్కడే మరణించారు. తీవ్రగాయాలైన శ్రీహరిని ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa