మాజీ మంత్రి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ ను విమర్శిస్తే సహించేది లేదని సెస్ డైరెక్టర్ గౌరినేని నారాయణరావు, మండల పార్టీ అధ్యక్షుడు పాపగారి వెంకటస్వామి గౌడ్ బిఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు. శుక్రవారం రోజున కాంగ్రెస్ నాయకులు కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేయడానికి ఖండించారు. గంభీరావుపేట మండల పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బిఆర్ఎస్ చేసిన అభివృద్ధిని చూసి ఓర్వలేకనే విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ రాష్ట్రాన్ని దేశం గర్వించే విధంగా అభివృద్ధి చేస్తే విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చలేక నే విమర్శలు చేస్తున్నారని, ఇచ్చిన హామీలను తుంగలో పెట్టి, దాడులు చేస్తే మేము కూడా తిరగబడతామని హెచ్చరించారు. ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి కూడా అమలు కాలేదన్నారు.
రుణమాఫీకి కోర్రిలు, కల్యాణలక్ష్మి లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఏమైంది. పెన్షన్ పెంచుతామని చెప్పి, 9నెలలు గడుస్తున్నా హామీలు తప్ప అమలు కాలేదు అన్నారు.ఇంతవరకు రైతు భరోసా ఇవ్వలేదు. గృహలక్ష్మి గృహజ్యోతి కొందరికే ఇచ్చి దరఖాస్తుల పేరుతో కార్యాలయ చుట్టూ ప్రజలను తింపుకుంటున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకుల్లారా మరోసారి కేటీఆర్ పైన గాని బిఆర్ఎస్ నాయకుల పైన గాని అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు వెంకట్ యాదవ్, ప్రధాన కార్యదర్శి గంధ్యాడపు రాజు నాయకులు కోమిరిశెట్టి లక్ష్మణ్ గోగు లింగం యాదవ్ ఎగదండి స్వామి ముచ్చర్ల మల్లేశం యాదవ్ గడ్డి హరీష్ వహిద్ కమ్మరి రాజారామ్,కొత్తింటి హన్మంత్ రెడ్డి శేఖర్ గౌడ్ అబిలాష్ వెంకట్రాజం మిను ఆనందం తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa