నల్లగొండ టౌన్: జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తిప్పర్తి లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.ప్రధానోపాధ్యాయులు నరసింహ నాయక్ అధ్యక్షత జరిగిన సమావేశంలో విద్యార్థులు ముందుగా పెరేడ్ నిర్వహించారు.కోలాటాలు, పోతురాజులు,డప్పు చప్పుళ్లతో ప్రభాతభేరి నిర్వహిచారు.ముఖ్య అతిధిగా గా హాజరైన తాజా మాజీ జడ్పీటీసీ పాశం రాంరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం నియోజకవర్గమునకు ఒక పాఠశాల ను మోడల్ అమ్మ ఆదర్శ పాఠశాల గా రూపొందించనున్నట్లు,దానిలో భాగంగా నే తిప్పర్తి ఉన్నత పాఠశాల మోడల్ అమ్మ ఆదర్శ పాఠశాల గా ఎంపికైనదని అన్ని వసతులు కల్పించి అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు.ఈ పాఠశాల లో చదివి విదేశాలలో స్థిరపడిన అనేక మంది నుండి విరాళాలు సేకరించి పాఠశాల రూపురేఖలు మార్చనున్నట్లు ఆయన తెలిపారు.తనవంతు సహాయం గా ఒక లక్ష రూపాయల విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకటేశ్వర రెడ్డి,ఎంఇఓ అరుంధతి, మాజీ సర్పంచులు రొట్టెల రమేష్,జాకటి మోష,మాజీ ఎంపీటీసీ పల్లె ఎల్లయ్య,కాంగ్రెసు నాయకులు పాశం సంపత్ రెడ్డి,బద్దం సుధీర్,బద్దం సైదులు,ఉపాధ్యాయులు చిటుప్రోలు సదానందం,భిక్షపతి,దామోదర్ రెడ్డి,పద్మలత, జ్యోతి, హేమీమ, జ్యోతిర్మయి,వెంకటయ్య,రామ మూర్తి,మంజుల వాణి తదితరులు పాల్గొన్నారుఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఏరుకొండ రాజేష్ కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని పరకాల ఎమ్మెల్యే రేవురు ప్రకాశ్ రెడ్డి అన్నారు. శనివారం ఆత్మకూరు మండల కేంద్రానికి చెందిన ఏరుకొండ రాజేష్ గత నాలుగు రోజుల క్రితం అమెరికాలో మృతి చెందిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే దేవుడి ప్రకాష్ రెడ్డి దిగ్భ్రాంతికి గురయ్యారు.
వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి అమెరికా నుంచి ఏడుకొండ రాజేష్ మృతి దేహాన్ని ఆత్మకూరుకు తీసుకువచ్చే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. ఎమ్మెల్యే నివాసం నుంచి ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ మీరు ఎవరు అధైర్య పడవద్దని ముఖ్యమంత్రి అండతో విదేశాలలో పోస్టుమార్టం పూర్తి చేయించామన్నారు. గురువారం వరకు ఏరుకొండ రాజేష్ మృతి దేహాన్ని ఆత్మకూర్ కి వచ్చే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. నీ కుమారుని నీకు అప్పజెప్పి నీ కుటుంబానికి మేము అండగా నిలుస్తామని మృతిని తల్లి ఏరుకొండ నీలమ్మకు ఫోన్ ద్వారా ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఓదార్చారు. విదేశాలకు ఉన్నత చదువులకు వెళ్లి ఏరుకొండ రాజేష్ విగత జీవిగా తిరిగి రావడం చాలా బాధాకరమని ప్రగాఢ సంతాపాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. మీకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నేను మా కాంగ్రెస్ నాయకులు ప్రజాప్రతిని అండగా ఉంటారని రాజేష్ కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యేతో పాటు కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు కమలాపురం రమేష్, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ నాయకులు మొద్దు ప్రవీణ్, కాంగ్రెస్ నాయకులు ఉన్నారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa