హైదరాబాద్ నగర ప్రజలకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అలర్ట్ జారీ చేశారు. నేడు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని చెప్పారు. ఇంటర్నేషనల్ ఫుట్ బాల్ టోర్నమెంట్ కప్-2024 నేటి నుంచి మూడ్రోజుల పాటు జరగనుంది. సెప్టెంబర్ 3, 6, 9వ తేదీలలో జీఎంసీబీ గచ్చిబౌలి స్టేడియంలో ఈ టోర్నమెంట్ జరగనుంది. దీంతో లింగంపల్లి నుంచి గచ్చిబౌలి, గచ్చిబౌలి నుంచి లింగంపల్లి, ట్రిపుల్ఐటీ సర్కిల్ నుంచి విప్రో రూట్లో ఆయా రోజుల్లో ఆంక్షలు ఉంటాయన్నారు. సాయంత్రం 4 నుంచి రాత్రి 9 వరకు ట్రాఫిక్ రద్దీ ఉంటుందని చెప్పారు. ఈ నేపథ్యంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు. ఈ రూట్లలో ప్రయాణాలు చేసి ఇబ్బందులకు గురి కావొద్దని సూచించారు.
ఇక నగరంలో భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అలర్ట్ జారీ చేశారు. ఐటీ కంపెనీ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఇవ్వాలని ఐటీ సంస్థలను కోరారు. కాగా, పోలీసుల సూచనలు, ఉద్యోగుల భద్రత నేపథ్యంలో సోమవారం పలు ఐటీ కంపెనీలు ఇంటి నుంచే పని చేసే అవకాశం కల్పించారు. నేడు కూడా భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో వర్క్ ఫ్రం హోంపై పునరాలోచన చేయాలని పోలీసులు సూచిస్తున్నారు.
భారీ వర్షాల కారణంగా సోమవారం రాష్ట్రవ్యాప్తంగా సెలవులు ప్రకటించారు. నేడు కూడా పలు జిల్లాలకు అధికారులు వర్షం హెచ్చరికలు జారీ చేశారు. 11 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. భారీ వర్షాలు ఉన్నందున ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా జిల్లా కలెక్టర్లు స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. మెదక్, నిర్మల్, ఖమ్మం, మహబూబాబాద్, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లోని స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. వర్షం కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అత్యవసరం అయితేేనే ఇళ్ల నుంచి బయటకు రావాలని సూచించారు. మరో రెండు, మూడు రోజులు వర్షాలు ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa