ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సికింద్రాబాద్ నుంచి మరో వందే భారత్ ట్రైన్.. ఈ స్టేషన్లలో ఆగుతుంది

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 09, 2024, 07:47 PM

హైదరాబాద్ నుంచి ట్రైన్ ప్రయాణాలు సాగించేవారికి గుడ్‌న్యూస్. త్వరలోనే మరో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. సికింద్రాబాద్-నాగపూర్ (మహారాష్ట్ర) మధ్య ఈ ట్రైన్ ప్రయాణికులకు సేవలందిస్తుంది. ఈ ట్రైన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్ 15న ప్రారంభించనున్నారు. 2 నగరాల మధ్య 578 కి.మీ దూరాన్ని ఈ రైలు 7.15 గంటల్లోనే చేరుకోనుంది.


ప్రాథమిక షెడ్యూల్ ప్రకారం ఈ కొత్త వందే భారత్ ట్రైన్ నాగ్‌పూర్‌లో ఉదయం 5 గం.కు బయల్దేరి మధ్యాహ్నం 12.15 గంటలకు సికింద్రాబాద్ చేరుకుుటంది. తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం ఒంటి గంటకు సికింద్రాబాద్‌లో బయల్దేరి రాత్రి 8.20 గంటలకు నాగ్‌పూర్ పట్టణానికి చేరుకుంటుంది. కాజీపేట్, రామగుండం, బల్లార్ష, చంద్రాపూర్, సేవాగ్రామ్ స్టేషన్లలో ఈ ట్రైన్ ఆగుతుందని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తెలిపారు.


హైదరాబాద్ నగరం నుంచి ప్రస్తుతం ఏపీలోని తిరుపతి, విశాఖ, కర్ణాటకలోని యశ్వంత్‌పుర ( బెంగళూరు) నగరాలకు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్లు ప్రయాణికులకు సేవలందిస్తున్నాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి విశాఖ, తిరుపతి నగరాలకు రైల్లు నడుస్తుండగా.. కాచిగూడ స్టేషన్ నుంచి యశ్వంత్‌పురకు ట్రైన్ పరుగులు పెడుతోంది. దీంతో నాగపూర్ ప్రాంతానికి మరో ట్రైన్ ప్రతిపాదించారు.


ప్రస్తుతం దేశవ్యాప్తంగా నడుస్తోన్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్లలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. తెలుగు రాష్ట్రాల మధ్య కూడా ప్రతి రోజూ వేల మంది ప్రయాణికులను వందే భారత్ ట్రైన్ల ద్వారా తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. మహారాష్ట్ర తెలంగాణ మధ్య కూడా వేల సంఖ్యలో ప్రతినిత్యం ప్రజలు ట్రైన్ జర్నీలు సాగిస్తున్నారు. వివిధ వ్యాపారాల నిమిత్తం ప్రతి రోజూ వేల సంఖ్యలో ముంబై సహా.. మహారాష్ట్రలోని పలు ప్రాంతాలకు వెళ్తుంటారు.


ఈ నేపథ్యంలోనే నాగపూర్- సికింద్రాబాద్ మధ్య సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు వందే భారత్ ట్రైన్ నడిపేందుకు సిద్ధమయ్యారు. ఈ ట్రైన్ అందుబాటులోకి వస్తే రెండు రాష్ట్రాల మధ్య రైల్వే కనెక్టివిటీ మరింత పెరగనుంది. తెలంగాణ నుంచి మూడో రాష్ట్రానికి వందే భారత్ ట్రైన్ అందుబాటులోకి వచ్చినట్లు అవుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa