తమిళనాడులో పుణ్యక్షేత్రాల్లో ఒకటైనా అరుణాచలంను సందర్శించేందుకు ఇటీవల పెద్ద ఎత్తున భక్తులు ఆసక్తి చూపిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున ఆలయాన్ని సందర్శిస్తున్నారు.ఈ నేపథ్యంలోనే తెలంగాణ టూరిజం భక్తుల కోసం ప్రత్యేక టూరిజం ప్యాకేజీలను ఆపరేట్ చేస్తోంది. హైదరాబాద్ నుంచి అరుణాచలంకు తెలంగాణ టూరిజం 'హైదరాబాద్-అరుణాచలం' పేరుతో ఓ ప్యాకేజీని అందిస్తోంది.హైదరాబాద్ నుంచి ఈ టూర్ను ఆపరేట్ చేస్తున్నారు. 3 రాత్రులు, 4 రోజుల పాటు ఈ టూర్ సాగుతుంది. ఇందులో భాగంగా అరుణాచలేశ్వర ఆలయం, కాణిపాకం, వేలూరు గోల్డెన్ టెంపుల్ కవర్ అవుతాయి. ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజీ సెప్టెంబర్ 15వ తేదీన అందుబాటులో ఉంది. ఇది తప్పితే… అక్టోబర్లో మరోసారి అవకాశం కల్పించనున్నారు.
ప్రయాణం ఇలా మొదలవుతుంది…
* మొదటి రోజు హైదరాబాద్లోని బషీర్ బాగ్ నుంచి సాయంత్రం 6.30 గంటలకు ప్రయాణం మొదలవుతుంది.
* రెండో రోజు ఉదయం 6 గంటలకు కాణిపాకం చేరుకుంటారు. ఫ్రెషప్ అయిన తర్వాత ఉదయం 9 గంటల లోపు దర్శనం పూర్తి చేస్తారు. అనంతరం అక్కడి నుంచి తిరువణ్ణామలైకి బయల్దేరుతారు.
* మధ్యాహ్నం ఒంటి గంటకు అరుణాచలం చేరుకుంటారు. తర్వాత అరుణాచలేశ్వరస్వామి దర్శనం పూర్తి చేసుకుంటారు. రాత్రి అరుణాచలంలోనే బస ఉంటుంది.
* ఇక మూడో రోజు ఉదయం టిఫిన్ పూర్తి కాగానే అక్కడి నుంచి బయల్దేరి మధ్యాహ్నానికి వేలూరు బయలు దేరుతారు. సాయంత్రం దర్శనం పూర్తి అవుతుంది. వెంటనే తిరుగు ప్రయాణం మొదలవుతుంది.
* 4వ రోజు ఉదయం హైదరాబాద్కు చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.
ప్యాకేజీ ధరలు ఇలా:
ఏసీ బస్సు ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ టూర్లో పెద్దలకు ప్యాకేజీని రూ.8,000, పిల్లలకు రూ.6,400గా నిర్ణయించారు. ఈ ప్యాకేజీలో బస్ జర్నీ, హోటల్స్ కవర్ అవుతాయి. ఆలయాల్లో దర్శనం టికెట్లు, భోజనానికి పర్యాటకులు స్వంతంగానే ఖర్చు భరించాల్సి ఉంటుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa